Airtel Profit: లాభాల బాటలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌.. పెరిగిన ఆదాయం

సెప్టెంబర్ 30తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్ నికర లాభం 89 శాతం పెరిగి రూ.2,145 కోట్లకు చేరుకుంది. ప్రతి..

Airtel Profit: లాభాల బాటలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌.. పెరిగిన ఆదాయం
Airtel

Updated on: Nov 01, 2022 | 7:00 AM

సెప్టెంబర్ 30తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్ నికర లాభం 89 శాతం పెరిగి రూ.2,145 కోట్లకు చేరుకుంది. ప్రతి వినియోగదారునికి సగటు ఆదాయాలు (ఏఆర్ పీయూ) మెరుగుపడటం వల్ల నికర లాభం పెరగడానికి కారణమైందని కంపెనీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ మొత్తం ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 22 శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది.

5G సేవల ప్రారంభం నుండి కంపెనీ ప్రయోజనాలను ఆశించింది. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) గోపాల్ విట్టల్ మాట్లాడుతూ కంపెనీ ఇప్పుడు 5జీ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ భారత్‌లో అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సమీక్షిస్తున్న త్రైమాసికంలో ARPU రూ.190కి పెరిగిందని ఎయిర్‌టెల్ తెలిపింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.153గా ఉంది.

అక్టోబర్ 6 నుండి ఎయిర్‌టెల్ 5G సేవ ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, నాగ్‌పూర్, సిలిగురి, వారణాసిలలో ప్రారంభమైంది. 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న కస్టమర్‌లందరూ Airtel 5G Plusని ఉపయోగించడం ప్రారంభించవచ్చు. సేవను ఉపయోగించడానికి మీరు 5G మొబైల్‌ని కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలి. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే భారతీయ మార్కెట్లో ఉన్న అన్ని 5G హ్యాండ్‌సెట్‌లు ప్రస్తుతం Airtel 5Gకి మద్దతు ఇవ్వవు. కంపెనీలు ఈ విషయాన్ని త్వరలో OTA ద్వారా అంటే ఎయిర్ అప్‌డేట్ ద్వారా పరిష్కరించవచ్చు.

ఇవి కూడా చదవండి

మీరు ఎయిర్‌టెల్‌ 4జీ సిమ్‌లో 5జీని ఆస్వాదించగలరా లేదా అని మీరు అయోమయానికి గురవుతుంటే ప్రజల సమాచారం కోసం, 5G సేవను ఉపయోగించడానికి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కంపెనీ చెబుతోంది. ఏదైనా సిమ్ విడిగా అవసరం లేదు. అంటే 4G వినియోగదారులు ఒకే సిమ్‌లో 5G సేవను పొందవచ్చు. ప్రస్తుతం 5G ప్లాన్‌ల ధరలను కంపెనీ వెల్లడించలేదు. కంపెనీ 5G సేవను పెద్ద ఎత్తున విడుదల చేసే వరకు ఎయిర్‌టెల్‌ వినియోగదారులు వారి ప్రస్తుత డేటా ప్లాన్‌లలో మాత్రమే ఎయిర్టెల్‌ 5జీ ప్లస్ సేవను పొందవచ్చని కంపెనీ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us