Bank Strike: వినియోగదారులకు అలర్ట్‌.. ఈ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఎందుకు..? ఎప్పుడంటే..!

Bank Strike: ఈ ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగులు తమ ఉద్యోగాలు, పెన్షన్లు, సామాజిక భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. గత ఆరేళ్లుగా బ్యాంకు నిలకడగా లాభదాయకంగా ఉన్నప్పటికీ, ప్రైవేటీకరణ సమర్థనీయం కాదని ఉద్యోగులు ఇప్పటికీ భావిస్తున్నారు. అలాగే..

Bank Strike: వినియోగదారులకు అలర్ట్‌.. ఈ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఎందుకు..? ఎప్పుడంటే..!
Bank Strike

Updated on: Jul 18, 2026 | 9:51 PM

Bank Strike: ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణకు నిరసనగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు జూలై 27, 2026న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, బ్యాంకులో 60% పైగా నియంత్రణను చేజిక్కించుకోవడానికి సుమారు $5.5 బిలియన్ల బిడ్‌ను దాఖలు చేసింది. దీనికి నిరసనగా ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడిబిఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్’ సమ్మెకు దిగాలని నిర్ణయిం1868533చింది. దేశవ్యాప్తంగా ఉన్న శాఖలలో అంతరాయాలు ఏర్పడవచ్చు. ఐడిబిఐ బ్యాంకు కొనుగోలు వార్త వెలువడినప్పటి నుండి బ్యాంకు స్టాక్ గణనీయమైన అస్థిరతను ఎదుర్కొంటోంది.

ఇది కూడా చదవండి: Silver Price: మహిళలకు పండగలాంటి వార్త.. రికార్డ్‌ స్థాయిలో తగ్గుతున్న వెండి ధర..!

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ప్రభావం:

ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమ్మె కారణంగా జూలై 27, 2026న వినియోగదారులకు నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెక్కుల క్లియరెన్స్‌లు వంటి అనేక బ్యాంకింగ్ సంబంధిత కార్యకలాపాలకు అంతరాయం కలగవచ్చు. అందువల్ల వినియోగదారులు తమ బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలి. అయితే, సమ్మె రోజున లావాదేవీలు వంటి అన్ని బ్యాంకింగ్ పనులను డిజిటల్ మాధ్యమాల ద్వారా చేసుకోవచ్చు. అలాగే ఇతర పనులను ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఉద్యోగుల డిమాండ్లు ఏమిటి?

ఈ ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగులు తమ ఉద్యోగాలు, పెన్షన్లు, సామాజిక భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. గత ఆరేళ్లుగా బ్యాంకు నిలకడగా లాభదాయకంగా ఉన్నప్పటికీ, ప్రైవేటీకరణ సమర్థనీయం కాదని ఉద్యోగులు ఇప్పటికీ భావిస్తున్నారు.

సమ్మె జరగడానికి ఇది కూడా ఒక కారణం:

IDBI బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రకారం, ప్రస్తుతం ఆ బ్యాంకులో 3,000 మందికి పైగా షెడ్యూల్డ్ కులాల వారు, 1,200 మందికి పైగా షెడ్యూల్డ్ తెగల వారు, 5,600 మందికి పైగా వెనుకబడిన తరగతుల వారు, 800 మందికి పైగా ఆర్థికంగా బలహీన వర్గాల వారు, అలాగే 880 మందికి పైగా దివ్యాంగులు పనిచేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ కారణంగా రిజర్వేషన్ నిబంధనల నుండి తమను మినహాయించవచ్చని ఉద్యోగులు భయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Smart Ration Cards: తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు.. పంపిణీ ఎప్పుడో తెలుసా..?

ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, ప్రధాన మంత్రి జన్ జీవన్ యోజన వంటి అనేక పథకాలలో ఐడిబిఐ బ్యాంక్ ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తోందని గమనించాలి. ఐడిబిఐ బ్యాంక్ ఈ ప్రైవేటీకరణ భారత బ్యాంకింగ్ చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా మారవచ్చు. అయితే, ఈ విషయంపై మార్కెట్ నిపుణులు మాట్లాడుతూ, బ్యాంక్ అప్పు తగ్గి, అభివృద్ధికి కొత్త మార్గం లభిస్తుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: Vande Bharat: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ రూట్లలో రెండు కొత్త వందే భారత్‌స్లీపర్‌ రైళ్లు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us