
Bank Holidays: మార్చి చివరి వారంలో దేశంలోని పలు నగరాల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం, మార్చి 26, 28, 29, 31 తేదీల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మార్చి 27న కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
చైత్ర నవరాత్రులలో తొమ్మిదవ రోజు శ్రీరాముడి జన్మదినంగా రామ నవమిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రజలు ఆలయాలను సందర్శించడం, శోభాయాత్రలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇది పబ్లిక్ హాలిడేగా పరిగణిస్తారు.
ఇది కూడా చదవండి: Fuel Price: వాహనదారులకు తీపికబురు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన!
ద్రిక్ పంచాంగం ప్రకారం ఈ ఏడాది రామ నవమి మార్చి 26, 27 తేదీల్లో వస్తోంది. నవమి తిథి మార్చి 26 ఉదయం 11:48 గంటలకు ప్రారంభమై, మార్చి 27 ఉదయం 10:06 గంటలకు ముగుస్తుంది. అందుకే కొన్ని రాష్ట్రాలు మార్చి 26న, మరికొన్ని రాష్ట్రాలు మార్చి 27న సెలవు పాటిస్తున్నాయి.
మార్చి 26న గుజరాత్, కర్ణాటక, చండీగఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. మార్చి 27న మధ్యప్రదేశ్, ఒడిశా, సిక్కిం, తెలంగాణ, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రామ నవమి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: సీన్ రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
మార్చి 28న నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అలాగే మార్చి 29 ఆదివారం కావడంతో కూడా బ్యాంకులకు సాధారణ సెలవు. RBI నిబంధనల ప్రకారం ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు, అలాగే అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవులే.
మార్చి 31న మహావీర్ జన్మకల్యాణక్ (మహావీర్ జయంతి) సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవాలనుకునే వారు ముందుగానే తమ ప్రాంతీయ బ్రాంచ్లను సంప్రదించడం మంచిది. సెలవుల కారణంగా పనుల్లో అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళిక అవసరం.
ఇది కూడా చదవండి: LPG Gas: సంచలన నిర్ణయం.. వీరికి నిలిచిపోనున్న గ్యాస్ బుకింగ్ సేవలు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి