
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ జ్యోతిష్యురాలు బాబా వంగా చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి. ప్రస్తుతం ఇంధన, గ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే 2026వ సంవత్సరంలో వీటి ధరలు పెరుగుతాయని బాబా వంగా ముందే చెప్పినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాదిలో ప్రపంచ సంఘర్షణ, ఆర్ధిక అస్థిరత ఉంటుందని ఆమె ముందే ఊహించారంటూ పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే బాబా వంగా ప్రత్యేకంగా పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదల నుంచి ప్రస్తావించినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. అలాగే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం గురించి బాబా వంగా ముందే ఊహించనట్లు ఇటీవల పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో బాబా వంగా అంచనాలు మరోసారి వైరల్ గా మారుతున్నాయి. ప్రపంచంలో ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు బాబా వంగా జ్యోతిష్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఆమె చెప్పే జ్యోతిష్యం సాధారణంగా అస్పష్టంగా ఉంటుంది. దీంతో ఏదైనా జరిగినప్పుడు ప్రస్తుత సంఘటనకు సులభంగా ముడిపెడతారు.