
వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాన్ని బలోపేతం చేయడానికి ప్రధాన ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వంఆయుష్మాన్ వయో వందనను ప్రారంభించింది. ఈ పథకాన్ని అక్టోబర్ 2024లో ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం 70 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి భారతీయ పౌరుడికి, సామాజిక-ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా వార్షిక నగదు రహిత ఆరోగ్య బీమాను రూ.5 లక్షలకు అందిస్తుంది. వృద్ధాప్య ఆరోగ్య సంరక్షణలో అంతరాన్ని తగ్గించడానికి, వృద్ధ పౌరులపై ఆర్ధిక భారాన్ని తగ్గించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అన్ని భారతీయ పౌరులు ఆయుష్మాన్ వయో వందనకు ఆటోమెటిక్గా అర్హత వస్తుంది. ముఖ్యంగా, ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై పథకం కింద ఇప్పటికే నమోదు చేసుకున్న లబ్ధిదారులు అదనంగా రూ. 5 లక్షలను టాప్-అప్ పొందుతారు. ప్రైవేట్ లేదా ఇతర ప్రభుత్వ ఆరోగ్య పథకాలను కలిగి ఉన్నవారు వారి ప్రస్తుత కవరేజ్ లేదా కొత్త పథకం మధ్య ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ముందుగా ఉన్న పరిస్థితులకు మినహాయింపులు లేవు. కవరేజ్ మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. ఏవీవీసీలో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆంకాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి 27 స్పెషాలిటీలలో 1,961 కంటే ఎక్కువ వైద్య సదుపాయాలు పొందవచ్చు. హిమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్, మొత్తం తుంటి, మోకాలి మార్పిడి వంటి మేజర్ చికిత్సలు పొందవచ్చు. అలాగే పీటీసీ ఎడయాగ్నస్టిక్ యాంజియోగ్రామ్, సింగిల్, డ్యూయల్-ఛాంబర్ పేస్మేకర్ ఇంప్లాంటేషన్ల వంటి చికిత్సలు తీసుకోవచ్చు.
ఒకసారి కార్డు జారీ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా 30,072 ఆసుపత్రులలో నగదు రహిత ఆరోగ్య సంరక్షణను పొందేందుకు వీలు కల్పిస్తుంది. దాదాపు 13,352 ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సాయం పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..