Pension Scheme: మోడీ సర్కార్‌ నుంచి అద్భుతమైన పెన్షన్‌ స్కీమ్‌.. నెలకు రూ.5000.. పూర్తి వివరాలు

మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను అందిస్తోంది. ఆర్థికంగా చేయూతనిందించేందుకు రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, రైతులకు వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. ఇక పెన్షన్‌..

Pension Scheme: మోడీ సర్కార్‌ నుంచి అద్భుతమైన పెన్షన్‌ స్కీమ్‌.. నెలకు రూ.5000.. పూర్తి వివరాలు
Cash

Updated on: Jan 28, 2023 | 7:49 AM

మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను అందిస్తోంది. ఆర్థికంగా చేయూతనిందించేందుకు రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, రైతులకు వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. ఇక పెన్షన్‌ పథకాలను కూడా ప్రవేశపెడుతోంది. మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన పథకాల్లో అటల్‌ పెన్షన్‌ యోజన ఒకటి. అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) అనేది భారత కేంద్ర ప్రభుత్వం మే 2015లో ప్రవేశపెట్టిన సామాజిక భద్రతా పథకం. ఈ పథకం అసంఘటిత రంగ కార్మికులు, కార్మికులకు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 5,000 వరకు గ్యారెంటీ పెన్షన్‌ను అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది మోడీ సర్కార్‌. అటల్ పెన్షన్ యోజనకు అర్హత పొందాలంటే తప్పనిసరిగా 18 మరియు 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పథకం వినియోగదారులకు వివిధ రకాల పెట్టుబడి ఎంపికలను అందిస్తుంది. వారు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక పెట్టుబడులను చేయడానికి వీలు కల్పిస్తుంది. డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి ప్రభుత్వం కనీస నెలవారీ పింఛను రూ. 1,000, గరిష్టంగా రూ. 5000.

అటల్ పెన్షన్ యోజన తక్కువ పెట్టుబడి అవసరాలు అన్ని ఆదాయ శ్రేణుల నుండి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో రూ. 5,000 పెన్షన్ లక్ష్యంతో ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినట్లయితే, వారు కేవలం రూ. 210 నెలవారీ పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది. మరోవైపు, నెలవారీ పెన్షన్ రూ. 1,000 కోసం పెట్టుబడి కేవలం రూ. 42 మాత్రమే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. నెల నెలా రూ.100 నుంచి రూ.500 వరకు చెల్లించవచ్చు.

అక్టోబర్ 1, 2022 నాటికి పన్ను చెల్లించే వారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకం అసంఘటిత రంగంలోని ప్రజలకు జీవితాంతం పెన్షన్‌ను అందించడం ద్వారా ఆర్థిక భద్రత కల్పిస్తుంది. చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన తర్వాత చందాదారుని 60 సంవత్సరాల వయస్సు వరకు సేకరించిన పెన్షన్‌ను నామినీకి అందిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ పథకంలో చేరాలంటే కచ్చితంగా భారతీయ పౌరులై ఉండాలి. ఆధార్‌తో లింకైన బ్యాంకు ఖాతా ఉండాలి. అలాగే బ్యాంకుకు లింకైనా మొబైల్‌ నెంబర్‌ ఉండాలి. ఈ స్కీమ్‌ అన్ని జాతీయ బ్యాంకులు అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌ లేదా బ్యాంకుల వద్ద ఈ అటల్‌ పెన్షన్‌ దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని అవసరమైన సమాచారాన్ని పూర్తి చేసి సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us