
బ్యాకింగ్, పేమెంట్స్ కు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఆన్ లైన్ అయినప్పటికీ.. పోస్టాఫీస్ పొదుపు పథకాల కోసం మాత్రం ఇప్పటికీ పోస్టాఫీస్ కు వెళ్లాల్సి వస్తోంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా ఇండియా పోస్ట్ ఇ పాస్ బుక్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇకపై పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆన్ లైన్ లో లేదా మొబైల్ లోనే తెలుసుకోవచ్చు.
ఇదొక డిజిటల్ పాస్బుక్. ఆన్ లైన్ బ్యాకింగ్ లాగానే పనిచేస్తుంది. మీ పోస్టాఫీస్ పొదుపు ఖాతాలోని అన్ని లావాదేవీలను ఆన్లైన్లో చెక్ చేసుకోడానికి ఇ పాస్ బుక్ పనికొస్తుంది. మీ రీసెంట్ ట్రాన్సాక్షన్స్ తో కూడిన మినీ-స్టేట్మెంట్ను కూడా ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ సర్విస్ ప్రస్తుతానికి మూడు పథకాలకు మాత్రమే అందుబాటులో ఉంది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి అకౌంట్ వివరాలు మాత్రమే ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మిగతా సర్వీసులు కూడా ఆన్ లైన్ చేస్తామని ఇండియా పొస్ట్ చెప్తోంది.
ఇ- పాస్ బుక్ ను యాక్సెస్ చేయడం చాలా ఈజీ.
ఇ-పాస్బుక్ సేవ ఉచితమే అయినప్పటికీ.. పాస్ బుక్ పోగొట్టుకున్నవాళ్లు డూప్లికేట్ పాస్బుక్ పొందడానికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఖాతా స్టేట్మెంట్/ డిపాజిట్ రసీదు కోసం కొన్నిసార్లు రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. పది కంటే ఎక్కువ ఉచిత చెక్కులు అవసరమైతే, ప్రతి చెక్కు లీఫ్కు రూ. 2 రుసుము వసూలు చేయబడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి