
ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ బుధవారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వియత్నాం జనరల్ సెక్రటరీ హెచ్ఈ టో లామ్తో భేటీ అయ్యారు. ఆయనతో భారత్, వియత్నాం మధ్య వ్యాపార సంబంధాలపై చర్చించారు. పలు రంగాల్లో టో లామ్ తెచ్చిన సంస్కరణల గురించి ఈ సందర్భంగా అదానీ ప్రస్తావించారు. ఆయన దార్శనికత, సంస్కరణలను ఆయన ప్రశంసించారు. టో లామ్తో భేటీ గురించి అదానీ ఆయన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
‘వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ హెచ్.ఇ. టో లామ్ ను కలవడం ఒక గౌరవం. ఇంధనం, లాజిస్టిక్స్, ఓడరేవులు, విమానయానంలో వియత్నాంను ప్రాంతీయ నాయకుడిగా నిలబెట్టడానికి ఆయన చేసిన సాహసోపేతమైన సంస్కరణలు, దార్శనిక అజెండా అసాధారణమైన వ్యూహాత్మక దూరదృష్టిని ప్రతిబింబిస్తాయి. ఈ పరివర్తనాత్మక ప్రయాణానికి తోడ్పడటానికి, లోతైన వియత్నాం-భారత్ ఆర్థిక భాగస్వామ్యాలకు వీలు కల్పించడానికి మేం ఎదురుచూస్తున్నాం’ అంటూ అదానీ ఎక్స్లో ట్వీట్ చేశారు.
It was a privilege to meet H.E. Tô Lâm, General Secretary of the Communist Party of Vietnam. His bold reforms and visionary agenda to position Vietnam as a regional leader in energy, logistics, ports and aviation reflect exceptional strategic foresight. We look forward to… pic.twitter.com/v0yjrJkh3Q
— Gautam Adani (@gautam_adani) July 30, 2025
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి