భారతదేశంలో 2016లో చేసిన నోట్ల రద్దు ప్రారంభించిన యూపీఐ సేవలు గణీనీయంగా పెరగుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఆన్లైన్ పేమెంట్స్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాజాగా ఆర్బీఐ రెండు వేల రూపాయల నోటు కూడా వెనక్కి తీసుకుంది. అలాగే ఎన్పీసీఐ రూపొందించిన యూపీఐ సేవలను మరింత విస్తరించే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ సేవలను ప్రారంభించారు. అయితే ఈ సేవలు ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డులకు మాత్రమే ఉంది. రూపే క్రెడిట్ కార్డులు కస్టమర్లకు క్రెడిట్ కార్డ్ జీవితచక్రం అంతటా డిజిటల్గా ఇంటిగ్రేటెడ్ అనుభవాన్ని అందిస్తాయి. వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ల పెరిగిన సౌలభ్యాన్ని ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డులను నేరుగా యూపీఐకు లింక్ చేసి చెల్లింపులు చేయవచ్చు. ఇది సురక్షితమైన చెల్లింపు లావాదేవీలను నిర్ధారిస్తుంది. ప్రస్తుతం యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్లను లింక్ చేయడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక కార్డులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం, వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్లను యూపీఐ బీమ్, మొబిక్విక్, పేటీఎం యాప్ల ద్వారా లింక్ చేయవచ్చు. యూపీఐ క్రెడిట్ కార్డ్ లింక్ను ప్రారంభించడానికి ఇతర అప్లికేషన్లు కూడా తమ టెక్నాలజీ ప్లాట్ఫారమ్లను అప్గ్రేడ్ చేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం