భారతదేశంలో ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ జారీ చేసే సంస్థ అయిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ, ఆధార్లో నమోదు చేయబడిన సమాచారాన్ని అప్డేట్ చేయమని ఎప్పటికప్పుడు అడుగుతోంది. కోట్లాది మంది ఆధార్ వినియోగదారులలో ఆధార్ అప్డేట్ను ప్రోత్సహించడానికి UIDAI ఉచిత ఆధార్ నవీకరణ సౌకర్యాన్ని ప్రారంభించింది.
అయితే, చాలా సార్లు మీరు ఆధార్లో మీ పేరు, చిరునామా మొదలైనవాటిని కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు మీరు మీ ఆధార్లోని మొబైల్ నంబర్ను అప్డేట్ చేయడానికి నెట్ సెంటర్, మీ సేవ సెంటర్ ఇలా పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్పై సరైన సమాచారాన్ని అప్డేట్ చేయడానికి ఆధార్ కార్డ్ జారీ చేసే సంస్థ UIDAI రెండు ఏర్పాట్లు చేసింది. మీరు దీన్ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా చేయవచ్చు.
అయితే ఆన్లైన్లో మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే సదుపాయం ప్రజలకు అందడం లేదు. ఇందుకోసం సీఎస్సీ కేంద్రానికి వెళ్లాలి. కానీ, మీరు ఇంట్లో కూర్చొని కూడా ఈ పనిని పూర్తి చేయడానికి మరొక మార్గం ఉంది. మీరు ఎలాంటి సమస్యను ఎదుర్కోలేరు.
ఆధార్లో మొబైల్ నంబర్ను అప్డేట్ చేయడానికి మీరు పోస్ట్మ్యాన్ సహాయం తీసుకోవచ్చు. పోస్ట్మ్యాన్ మీ ఇంటికి వచ్చి మీ మొబైల్ నంబర్ను అప్డేట్ చేస్తారు. దీని కోసం, మీరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ప్రభుత్వ పోర్టల్కు వెళ్లాలి. తర్వాత, మొబైల్ నంబర్ను అప్డేట్ చేయడానికి.. మీరు పోర్టల్లో డోర్స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ రిక్వెస్ట్ ఫారమ్ను పూరించాలి.
ఫారమ్ను నింపేటప్పుడు.. మీ మొబైల్ నంబర్ అప్డేట్ ఎంపికను ఎంచుకోండి. దీని తర్వాత సబ్మిట్ బటన్ నొక్కండి. అయితే దీని కోసం తపాలా శాఖకు రూ.50 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఫారమ్ను నింపిన తర్వాత.. ఏదైనా సమస్య ఉంటే మీరు 155299కి కాల్ చేయవచ్చు. ఇక్కడ మీ సమస్యను వివరించండి. అందుకు తగినట్లుగా వారు పరిష్కరిస్తారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి