Budget 2021 : కస్టమ్స్ సుంకాన్ని తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. తగ్గనున్న బంగారం, వెండి ధరలు

దేశీయంగా పసిడి ధరలకు ఊరట లభించనుంది. ఈ మేరకు బంగారం, వెండిపై క‌స్టమ్స్ సుంకాన్ని క్రమ‌బ‌ద్దీక‌రించేందుకు చ‌ర్యలు.

Budget 2021 : కస్టమ్స్ సుంకాన్ని తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. తగ్గనున్న బంగారం, వెండి ధరలు

Updated on: Feb 01, 2021 | 3:09 PM

Rationalising custom duty on gold and silver  : దేశీయంగా పసిడి ధరలకు ఊరట లభించనుంది. ఈ మేరకు బంగారం, వెండిపై క‌స్టమ్స్ సుంకాన్ని క్రమ‌బ‌ద్దీక‌రించేందుకు చ‌ర్యలు తీసుకుంటామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ తెలిపారు. ఈ క్రమంలో బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది. నైలాన్ చిప్స్, నైలాన్ ఫైబ‌ర్‌పై కూడా బేసిక్ క‌స్టమ్స్ డ్యూటీని త‌గ్గించ‌నున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో నైలాన్ దుస్తుల ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది. మొబైల్ ఫోన్ల ధ‌ర‌లు, కార్ల విడిభాగాల ధ‌ర‌లు కూడా పెర‌గ‌నున్నాయి. సోలార్ ఇన్వర్టర్లపై ప‌న్ను పెంపు, ఇంపోర్టెడ్ దుస్తులు మ‌రింత ప్రియం కానున్నాయి.

Read Also…. Union Budget 2021 Telugu Live: కేంద్ర బడ్జెట్ హైలైట్స్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్