పాకిస్తాన్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా.. ఉగ్రవాద స్థావరాలపై ఈ రోజు ఉదయం దాడి చేసిన విషయం తెలిసిందే. 12 మిరాజ్ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఉగ్ర స్థావరాలపై వెయ్యి కిలోల బాంబులు వేయడంతో వందల మంది ఉగ్రవాదులు మృత్యువాత పడ్డారు. అయితే.. తాజాగా.. ఈ ఘటనపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. క్రికెట్ స్టైల్లో అదిరిపోయే ట్వీట్ చేశారు. మీరు వేసిన బౌలింగ్ కు.. మా వాళ్లు చాలా బాగా ఆడారు.. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకోండి. లేదంటే ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని ట్వీట్ లో తెలిపాడు సెహ్వాగ్. దీనిపై మరో బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీర్ కూడా స్పందించారు. ‘జై హింద్, ఇండియా స్ట్రైక్ట్స్ బ్యాక్ అంటూ గంభీర్ ట్విట్టర్ లో ట్వీట్ పోస్ట్ చేశారు.
The boys have played really well. #SudharJaaoWarnaSudhaarDenge #airstrike
— Virender Sehwag (@virendersehwag) February 26, 2019
JAI HIND, IAF ?? @IAF_MCC @adgpi #IndiaStrikesAgain #IndiaStrikesBack #IndiaStrikes
— Gautam Gambhir (@GautamGambhir) February 26, 2019