AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఎస్ పోలీసుల నోటీసులకు అశోక్ వివరణ ఇవ్వాలి- హైకోర్ట్

హైదరాబాద్‌ : ఐటీ గ్రిడ్స్‌ కేసులో ఆ సంస్థ సీఈవో అశోక్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అశోక్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లోత్ర కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో పోలీసులు అశోక్‌కు ఇచ్చిన నోటీసులకు ఇప్పుడే వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇప్పుడే వివరణ ఇవ్వలేమని అశోక్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన […]

టీఎస్ పోలీసుల నోటీసులకు అశోక్ వివరణ ఇవ్వాలి- హైకోర్ట్
Ram Naramaneni
|

Updated on: Mar 11, 2019 | 1:42 PM

Share

హైదరాబాద్‌ : ఐటీ గ్రిడ్స్‌ కేసులో ఆ సంస్థ సీఈవో అశోక్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అశోక్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లోత్ర కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో పోలీసులు అశోక్‌కు ఇచ్చిన నోటీసులకు ఇప్పుడే వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇప్పుడే వివరణ ఇవ్వలేమని అశోక్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని అశోక్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. రాజకీయ కుట్ర, దురుద్దేశాల్లో భాగంగా తనపై కేసులు పెట్టారని అశోక్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. మరోవైపు డేటా చౌర్యం కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు ముమ్మరం చేసింది.