
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇందులో పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన కె. రవి శ్రీ తేజకు ఫస్ట్ ర్యాంకు సాధించాడు. అలాగే డి. చంద్రశేఖర్(హైదరాబాద్), ఆకాశ్ రెడ్డి(రంగారెడ్డి జిల్లా), కార్తికేయలు(రంగారెడ్డి జిల్లా) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. టాప్-10లో బాలురే ఉండటం విశేషం. ఫలితాలను చూడాలనుకున్న వారు eamcet.tsche.ac.in, manabadi.co.in కు లాగిన్ అవ్వొచ్చు.