AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కొత్తగా 71 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. రోజు రోజుకి అంతకంతకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం కొత్తగా 71 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,991 కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 650. కాగా కోవిడ్‌-19తో రాష్ట్రంలో ఇవాళ ఒకరు మృతిచెందారు. వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 57 మంది చనిపోయారు. కోవిడ్‌-19 నుంచి కోలుకుని నేడు 120 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. […]

తెలంగాణలో కొత్తగా 71 కరోనా పాజిటివ్‌ కేసులు
Balaraju Goud
|

Updated on: May 26, 2020 | 8:49 PM

Share

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. రోజు రోజుకి అంతకంతకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం కొత్తగా 71 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,991 కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 650. కాగా కోవిడ్‌-19తో రాష్ట్రంలో ఇవాళ ఒకరు మృతిచెందారు. వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 57 మంది చనిపోయారు. కోవిడ్‌-19 నుంచి కోలుకుని నేడు 120 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 1,284 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇవాళ కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 38, రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చల్‌ జిల్లాలో 6 నమోదు కాగా, సూర్యాపేట, వికారాబాద్‌, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇక వలస కూలీలు-12 మంది, విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.