AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిని చంపిన వ్యక్తికి జీవిత ఖైదు

డబ్బుల కోసం తల్లిని చంపిన కేసులో రంగారెడ్డిజిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తల్లిని హత్య చేసిన కుమారుడికి జీవితఖైదుతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు 14వ ఆదనపు సెషన్స్‌ జడ్జి.

తల్లిని చంపిన వ్యక్తికి జీవిత ఖైదు
Balaraju Goud
|

Updated on: Oct 29, 2020 | 7:59 AM

Share

డబ్బుల కోసం తల్లిని చంపిన కేసులో రంగారెడ్డిజిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తల్లిని హత్య చేసిన కుమారుడికి జీవితఖైదుతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు 14వ ఆదనపు సెషన్స్‌ జడ్జి కె.సుదర్శన్‌ తీర్పునిచ్చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండలో నివాసముండే కుంచర్ల కొండమ్మ ఏపీలోని కందుకూరు గ్రామంలో ఆస్తిని అమ్మి కొడుకులకు సమంగా పంచి ఇచ్చింది. కొండమ్మ తన అవసరాల నిమిత్తం తన వద్ద లక్ష రూపాయలు ఉంచుకుంది. ఆ డబ్బుపై ఆశపడ్డ కొడుకు తరుచు డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురిచేశాడు. చివరికి మద్యానికి బానిసైన కొడుకు కొండయ్య తల్లి దాచుకున్న లక్ష రూపాయలు దొంగిలించి ఆపై ఆమెను దారుణంగా హత్య చేశాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన జడ్డి సుదర్శన్‌ నిందితుడికి జీవితఖైదుతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.