AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్తికోసం తల్లిద౦డ్రులకు నిప్పంటించిన ఘనుడు

అనంతపురం జిల్లాలో తాజాగా జరిగిన ఘటన బిడ్డలపై ఆశలు పెంచుకునే తల్లిదండ్రులకు కనువిప్పుగా నిలిచింది. కుటుంబ ఆస్తిని తనకు పంచి ఇవ్వడం లేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి కన్న తండ్రులపైనే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కణేకల్‌లోని రామ్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న నారాయణరెడ్డి, నర్సమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరికి గ్రామంలో ఎకరా పొలం, సొంత ఇల్లు ఉంది. ఈ క్రమంలో తనకు ఆస్తి పంచాలంటూ వారి చిన్న కుమారుడు మధుసూదన్‌రెడ్డి కొంతకాలంగా తల్లిదండ్రులకు […]

ఆస్తికోసం తల్లిద౦డ్రులకు నిప్పంటించిన ఘనుడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 18, 2020 | 9:22 PM

Share

అనంతపురం జిల్లాలో తాజాగా జరిగిన ఘటన బిడ్డలపై ఆశలు పెంచుకునే తల్లిదండ్రులకు కనువిప్పుగా నిలిచింది. కుటుంబ ఆస్తిని తనకు పంచి ఇవ్వడం లేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి కన్న తండ్రులపైనే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.

కణేకల్‌లోని రామ్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న నారాయణరెడ్డి, నర్సమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరికి గ్రామంలో ఎకరా పొలం, సొంత ఇల్లు ఉంది. ఈ క్రమంలో తనకు ఆస్తి పంచాలంటూ వారి చిన్న కుమారుడు మధుసూదన్‌రెడ్డి కొంతకాలంగా తల్లిదండ్రులకు అడుగుతున్నారు. అయితే వారసత్వంగా వస్తున్న పొలం, ఇల్లును విభజించడం ఇష్టం లేని దంపతులు ఆస్తి పంచేందుకు నిరాకరించారు.

ఆస్తి రాసివ్వడం లేదని కోపం పెంచుకున్న మధుసూదన్‌రెడ్డి ఆదివారం తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. మంటల్లో కాలిపోతున్న వారిని స్థానికులు రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను కర్ణాటకలోని బళ్లారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.