నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

నల్గొండ : నల్లొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు-టాటా ఏస్‌ వాహనం ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. మరొ పదిమంది వరకు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్టీసీ బస్సు దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనం […]

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2019 | 3:08 PM

నల్గొండ : నల్లొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు-టాటా ఏస్‌ వాహనం ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. మరొ పదిమంది వరకు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్టీసీ బస్సు దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనం టైర్ పగిలిపోవడంతో.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.