సుప్రీంను కుదిపేసిన సిట్టింగ్ ఎంపీ కేసు.. తెలంగాణ పాలిటిక్స్‌లో సెన్సేషన్

ప్రజల చేత ఎన్నుకోబడి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీ కోర్టుకు తెలిపిన ఓ అంశం సంచలనంగా మారింది.

సుప్రీంను కుదిపేసిన సిట్టింగ్ ఎంపీ కేసు.. తెలంగాణ పాలిటిక్స్‌లో సెన్సేషన్
Follow us

|

Updated on: Sep 11, 2020 | 5:40 PM

ప్రజల చేత ఎన్నుకోబడి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీ కోర్టుకు తెలిపిన ఓ అంశం సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మొత్తం 118 మందిపై వివిధ రకాల కేసులు ఉన్నాయని అమికస్ క్యూరీ సుప్రీం కోర్టు ధర్మాసనం వివరించారు. అయితే ఇందులో ఒక ఎంపీపై మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష పడే స్థాయిలో కేసు ఉందని వెల్లడించడం సంచలనంగా మారింది. ఆ సిట్టింగ్ ఎంపీ ఎవరన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నేర చరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులపై సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను ఒక సంవత్సరంలోపు విచారణ పూర్తి చేయాలని 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శుక్రవారం జరిగిన విచారణలో ధర్మాసనం ప్రధానంగా లేవనెత్తింది. ప్రజా ప్రతినిధులపై కేసులు యధాతధంగా కొనసాగుతున్నాయని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో ఆమికస్ క్యూరీగా విజయ్ హన్సారియాను సుప్రీంకోర్టు ధర్మాసనం నియమించింది.

కాగా శుక్రవారం జరిగిన విచారణలో విజయ్ హన్సారియా పలు ఆశ్చర్యకరమైన అంశాలను ధర్మాసనం ముందుంచారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించి నేర చరిత్ర కలిగిన ప్రజాప్రతినిధుల వివరాలను ఆయన ధర్మాసనం ముందుంచారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మొత్తం 118 మందిపై వివిధ రకాల కేసులు ఉన్నాయని ఆయన కోర్టుకు సమర్పించారు. ఈ 118 మందిలో ఒక సిట్టింగ్ ఎంపీపై యావజ్జీవ కారాగార జైలు శిక్ష పడే స్థాయిలో కేసు ఉందని విజయ్ హన్సారియా సుప్రీంకోర్టు ధర్మాసనం నివేదించారు.

అదే సమయంలో వివిధ పార్టీల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన జాబితాను కూడా ఆయన కోర్టు ముందుంచారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, విజయ రామారావు, జగ్గారెడ్డి, లింగయ్య, దొంతు మాధవ్, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితర నేతలు ఉన్నారు. బీజేపీ తరఫున.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, జితేందర్ రెడ్డి, సీఎం రమేష్ తదితరులపై కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

ఎంఐఎం పార్టీ తరపున షాషా ఖాద్రి, అక్బరుద్దీన్, అసదుద్దీన్, బలాలా, కైసర్ మొయినుద్దీన్‌లపై కేసులున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పక్షాన చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కేసులున్నట్లు అమికస్ క్యూరీ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, గువ్వల బాలరాజు, విద్యాసాగర్, శ్రీనివాస్, బాల్క సుమన్, దానం నాగేందర్, పువ్వాడ అజయ్ తదితర 28 మంది ప్రజా ప్రతినిధులపై కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీం కోర్టు ధర్మాససానికి నివేదించారు.