
న్యూఢిల్లీ: భారత ఫైటర్ పైలట్ అభినందన్ కోసం విమానం పంపుతామని పాకిస్థాన్కు భారత ప్రభుత్వం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే అందుకు దాయాది దేశం నిరాకరించిందట. రోడ్డు మార్గం ద్వారానే అప్పగిస్తామని స్పష్టం చేసిందట. రోడ్డు మార్గం ద్వారా అయితే చాలా మంది ప్రజలు ఉంటారని, ఆ తాకిడిని తప్పించుకునేందుకే వాయి మార్గం ద్వారా అభినందన్ను తీసుకురావాలని భారత్ భావించిందట. కానీ అందుకు పాకిస్థాన్ అంగీకరించకలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.