రాణ్ ఆఫ్ కచ్‌ వద్ద పాక్ వ్యక్తి సంచారం.. అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్

గాంధీనగర్ : భారత్ బార్డర్ లో పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తిని బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. గుజరాత్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్ టీం పాకిస్థాన్ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ టీం గస్తీ కొనసాగిస్తుండగా..పిల్లర్ నంబర్ 1050 వద్ద పాకిస్థాన్ కి చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ.. కనిపించడడంతో అదుపులోకి తీసుకున్నారు. 50 ఏళ్ల వయస్సున్న సదరు వ్యక్తి వద్ద ఎలాంటి వస్తువులు కానీ, ధ్రువపత్రాలు కాని లేవని అధికారులు తెలిపారు. అతన్ని […]

రాణ్ ఆఫ్ కచ్‌ వద్ద పాక్ వ్యక్తి సంచారం.. అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2019 | 3:33 PM

గాంధీనగర్ : భారత్ బార్డర్ లో పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తిని బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. గుజరాత్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్ టీం పాకిస్థాన్ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ టీం గస్తీ కొనసాగిస్తుండగా..పిల్లర్ నంబర్ 1050 వద్ద పాకిస్థాన్ కి చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ.. కనిపించడడంతో అదుపులోకి తీసుకున్నారు. 50 ఏళ్ల వయస్సున్న సదరు వ్యక్తి వద్ద ఎలాంటి వస్తువులు కానీ, ధ్రువపత్రాలు కాని లేవని అధికారులు తెలిపారు. అతన్ని విచారిస్తున్నట్లు ఓ బీఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి తెలిపారు.