AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంటూరు జిల్లాలో పెళ్లైన 24 గంటల్లోపే నవ వధువు మరణం : కార‌ణం ?

గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన 24 గంటల్లోనే నవ వధువు త‌నువు చాలించింది. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన ఆమె..పూర్తిగా ఒక్క రోజు కూడా అక్క‌డ గ‌డ‌ప‌కుండానే ప్రాణాలు విడిచింది.

గుంటూరు జిల్లాలో పెళ్లైన 24 గంటల్లోపే నవ వధువు మరణం : కార‌ణం ?
Ram Naramaneni
|

Updated on: Aug 08, 2020 | 1:33 PM

Share
Guntur district bride death : గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన 24 గంటల్లోనే నవ వధువు త‌నువు చాలించింది. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన ఆమె..పూర్తిగా ఒక్క రోజు కూడా అక్క‌డ గ‌డ‌ప‌కుండానే ప్రాణాలు విడిచింది. వివ‌రాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలోని ఇరుకుపాలెంకు చెందిన ఆనంద్‌కు… రొంపిచర్ల మండలం మునమాకకు చెందిన భవాని అనే యువ‌తితో పెళ్లి కుద‌ర్చారు పెద్ద‌లు. భవాని టీటీసీ కంప్లీట్ చేసి ఇంటి వ‌ద్దే ఖాళీగా ఉంటుంది. ఆమె కొంతకాలంగా నిమ్ము, ఆయాసం వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ఎదుర్కుంటుంది‌. ఎంగేజ్‌మెంట్ అప్ప‌టికే అయిపోవ‌డంతో.. రెండు కుటుంబాల పెద్ద‌లు ప‌లుసార్లు చర్చించి.. గురువారం ఉదయం ఇరుకుపాలెంలోని చర్చిలో వివాహం జ‌రిపించారు.

సాంప్ర‌దాయం ప్ర‌కారం భవాని పెళ్లి అనంత‌రం అత్తారింటికి వెళ్లింది. అయితే తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ప‌డింది. వెంటనే ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఆమెను నర్సరావుపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి త‌ర‌లించారు. అక్కడ డాక్ట‌ర్లు ట్రీట్మెంట్ చేసేందుకు నిరాకరించడంతో గుంటూరు గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. డాక్ట‌ర్ వచ్చి చికిత్స అందించేలోపే భవాని ప్రాణాలు విడిచింది. వివాహానికి ముందుగా ఈ నెల 4న క‌రోనా టెస్టు నిర్వహించగా.. ఆమెకు నెగిటివ్‌ వచ్చింది. దీంతో మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది కుటుంబానికి అప్పగించారు. అనంత‌రం వారు ఖ‌న‌నం చేశారు. కాగా పెళ్లైన 24 గంటల్లోనే నవ వధువు ఇలా ఆక‌స్మాత్తుగా ప్రాణాలు విడ‌వ‌డం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Read More : మాజీ ఎంపీ నంది ఎల్లయ్య క‌న్నుమూత‌

Follow Us
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో