లాక్ డౌన్ పై మరింత డేగ కన్ను.. మోదీ
ఈ నెల 20 వరకు ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా లాక్ డౌన్ ను ఎలా అమలు చేస్తాయో నిశితంగా గమనించడం జరుగుతుందని, అప్పటివరకు ఆంక్షలు కొనసాగుతాయని ప్రధాని మోదీ అన్నారు.
ఈ నెల 20 వరకు ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా లాక్ డౌన్ ను ఎలా అమలు చేస్తాయో నిశితంగా గమనించడం జరుగుతుందని, అప్పటివరకు ఆంక్షలు కొనసాగుతాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ దేశంలోని ప్రతి భారతీయుడూ ఆరోగ్య సేతు యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చ్చారు. దీనివల్ల కరోనా వ్యాప్తిని చాలావరకు నియంత్రించగలుగుతామన్నారు. ప్రజలు ఇప్పటివరకు స్ఫూర్తిని ఇకముందు కూడా చూపుతారని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. తీవ్రతను ఎలా పరిమితం చేయాలనేదానిపై అన్ని రాష్ట్రాలతో చర్చించినట్టు మోదీ వివరించారు.
మరో వారం వరకు కఠిన చర్యలు.. మోదీ..
లాక్ డౌన్ నేపథ్యంలో మరో వారం రోజులపాటు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ వారం రోజులూ అన్ని రాష్ట్రాల పనితీరును చెక్ చేస్తామని, ఏ రాష్ట్రమైనా కరోనాను చాలా వరకు నియంత్రించిన పక్షంలో ఆ ర్రాష్ట్రానికి ఆంక్షలను సడలించే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాలూ ప్రోటోకాల్ పాటించకతప్పదన్నారు. రేపు తాము మరికొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీ అప్పుడే ప్రధాని తీరును తప్పు పట్టింది. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికె ప్రజలు ఎన్నో కష్టాలు పడుతుండగా.. మే 3 వరకు దీన్ని పొడిగించడంలోని ఔచిత్యమేమిటని ప్రశ్నించింది. ఇది సముచితం కాదని అభిప్రాయపడింది.