ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సినీనటుడు మోహన్బాబు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని, విద్యాభివృద్ధి అంశంలో ఏపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, తాను నిర్వహిస్తున్న విద్యానికేతన్ విద్యార్థులకు 2014-15 నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మాట నిలబెట్టుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్రమంతా తిరుగుతూ అమలు చేయని హామీలు ఎందుకిస్తున్నారని మోహన్బాబు ప్రశ్నించారు. తాను ఏ పార్టీలోనూ లేనని స్పష్టం చేస్తూ, తన వ్యాఖ్యల వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేదని చెప్పారు.