AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. అంతేకాదు..కళ్లు పీకి..

ఓ వైపు దేశం మొత్తం కరోనా భయంతో వణికిపోతుంటే.. మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనా కాలంలో ఓ కామాంధుడు.. ఆరేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడి గట్టాడు. అంతేకాదు ఆ చిన్నారి కళ్లుపీకి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని దామో ప్రాంతంలో బుధవారం ఓ చిన్నారి అపహరణకు గురైంది. ఇంటికి సమీపంలోనే తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా.. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఒకడు ఎత్తుకెళ్లిపోయాడు. అయితే […]

దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. అంతేకాదు..కళ్లు పీకి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 8:04 PM

Share

ఓ వైపు దేశం మొత్తం కరోనా భయంతో వణికిపోతుంటే.. మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనా కాలంలో ఓ కామాంధుడు.. ఆరేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడి గట్టాడు. అంతేకాదు ఆ చిన్నారి కళ్లుపీకి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని దామో ప్రాంతంలో బుధవారం ఓ చిన్నారి అపహరణకు గురైంది. ఇంటికి సమీపంలోనే తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా.. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఒకడు ఎత్తుకెళ్లిపోయాడు. అయితే పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆ పరిసార ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. అయితే గురువారం తెల్లవారు జామున ఇంటికి కొంచెం దూరంలో తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేసి.. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలువురు అనుమానితులను విచారించారు. బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడింది ఎవరై ఉంటారన్న దానిపై క్లూస్ కోసం ప్రయత్నిస్తున్నామని.. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా.. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని.. అంతేకాకుండా కళ్లపై కూడా దాడి జరిగిందని కూడా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుందన్నారు.