డబ్బులు లేక మూడు రోజుల తర్వాత అమ్మ అంత్యక్రియలు

|

Oct 19, 2020 | 11:54 PM

అమ్మ..మనకు రూపం ఇచ్చిన మనిషి..మనకు నడత, నడక నేర్పిన వ్యక్తి. ఈ ప్రపంచంలోకి అడుకుపెట్టకముందే మనల్ని అమితంగా ప్రేమించిన దైవస్వరూపం.

డబ్బులు లేక మూడు రోజుల తర్వాత అమ్మ అంత్యక్రియలు
Follow us on

అమ్మ..మనకు రూపం ఇచ్చిన మనిషి..మనకు నడత, నడక నేర్పిన వ్యక్తి. ఈ ప్రపంచంలోకి అడుకుపెట్టకముందే మనల్ని అమితంగా ప్రేమించిన దైవస్వరూపం అమ్మ. అలాంటి అమ్మకు చనిపోయాక అంతిమ సంస్కారాలు చెయ్యడానికి ఇద్దరు కొడుకులు 3 రోజులు ఎదురుచూశాడంటే మనం ఏ సమాజంలో, ఎలాంటి  పరిస్థితుల్లో బ్రతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే..కర్ణాటక బెల్గాంకు చెందిన భారతి బస్తవద్కర్​ అనే మహిళ అంతమసంస్కారాలు చేయడానికి ఆమె కుమారులకు ఏకంగా మూడు రోజుల సమయం పట్టింది. అనారోగ్యం కారణంగా భారతి ఈ నెల 16న బిమ్స్​ హాస్పిటల్‌లో చేరింది. ఈ క్రమంలో సరైన వైద్యం అందక తుదిశ్వాస విడిచింది.

కరోనా లాక్​డౌన్​ కారణంగా ఆమె కుమారులు ఇరువురూ ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఆసుపత్రికి ఫీజు చెల్లించలేకపోయారు. తెలిసిన వారి దగ్గర అడిగినా ఫలితం దక్కలేదు. మొత్తం చెల్లిస్తేనే డెడ్‌బాడీని అప్పగిస్తామని ఆసుపత్రి సిబ్బంది తెగేసి చెప్పారు. దీంతో ఆ తల్లి కన్నబిడ్డలు  మూడు రోజుల పాటు వేచి చూశారు.ఈ తరుణంలో అన్నదమ్ముల బాధను గుర్తించిన ఓ స్వచ్ఛంద సంస్థ సాయం చేసింది. చివరకు మూడు రోజుల తర్వాత దహన సంస్కారాలు చేశారు.
Also Read :