#COVID19 కరోనా భయంతో ప్రభుత్వోద్యోగి ఆత్మహత్య

కరోనా వైరస్ వ్యాప్తి దేశ ప్రజలందరినీ ఆందోళనలో ముంచెత్తుతోంది. వారిలో కొందరు ఎలాగైనా ఈ ప్రమాదకరమైన పరిస్థితిని అధిగమిస్తామన్న నమ్మకంతో స్వీయ జాగ్రత్తలు పాటిస్తుంటే మరికొందరు మాత్రం భయాందోళనతో తనువు చాలిస్తున్నారు.

#COVID19 కరోనా భయంతో ప్రభుత్వోద్యోగి ఆత్మహత్య

Updated on: Apr 02, 2020 | 3:29 PM

Government employee commits suits due to Corona:  కరోనా భయంతో ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా వైరస్ వ్యాప్తి దేశ ప్రజలందరినీ ఆందోళనలో ముంచెత్తుతోంది. వారిలో కొందరు ఎలాగైనా ఈ ప్రమాదకరమైన పరిస్థితిని అధిగమిస్తామన్న నమ్మకంతో స్వీయ జాగ్రత్తలు పాటిస్తుంటే మరికొందరు మాత్రం భయాందోళనతో తనువు చాలిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ ప్రభుత్వ ఉద్యోగి తనకు కరోనా సోకిందన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో తోటి అధికార యంత్రాంగం నివ్వెరపోయారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సహారాన్‌పూర్‌లోని నాకూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయంలో ఉరి వేసుకున్నాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. అతను కరోనావైరస్ వ్యాప్తితో చాలా భయపడుతున్నానంటూ సూసైడ్ నోట్‌లో రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ప్రభుత్వ ఉద్యోగి చాలా రోజుల నుంచి డిప్రెషన్‌లో ఉన్నారని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని స్థానిక పోలీసు అధికారి, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ ధృవీకరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us