ముంబైలో అగ్ని ప్రమాదం..బిల్డింగ్‌లో చిక్కుకున్న 100 మంది

|

Jul 22, 2019 | 7:03 PM

ముంబైలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది అంతస్తుల బిల్డింగ్‌లోని 3వ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 3, 4వ అంతస్తుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 100 మంది వరకు బిల్డింగ్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ముంబైలోని బాంద్రా పశ్చిమ భాగంలో సోమవారం (జులై 22) సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన భవనంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టెలికమ్ […]

ముంబైలో అగ్ని ప్రమాదం..బిల్డింగ్‌లో చిక్కుకున్న 100 మంది
Follow us on

ముంబైలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది అంతస్తుల బిల్డింగ్‌లోని 3వ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 3, 4వ అంతస్తుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 100 మంది వరకు బిల్డింగ్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ముంబైలోని బాంద్రా పశ్చిమ భాగంలో సోమవారం (జులై 22) సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన భవనంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టెలికమ్ కంపెనీ ‘ఎంటీఎన్‌ఎల్’ ఉంది.  ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఉద్యోగులు భవనం పైభాగానికి చేరుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మంటలు అంతకంతకూ వ్యాపిస్తుండటంతో ఆందోళన నెలకొంది. కాగా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.