AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్బిణికి కరోనా.. క్వారంటైన్‌లోకి ముగ్గురు డాక్టర్లతో సహా సిబ్బంది

కరోనా మహమ్మారి కాటుకు చిన్న పెద్ద తేడా లేకుండా బలవుతున్నారు. తెలియకుండానే వైరస్ అంటుకుంటోంది. తాజాగా భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకున్న ఓ గర్భిణికి కరోనా సోకడంతో.. ముగ్గురు వైద్యులతోపాటు 12 మందిని హోంక్వారంటైన్‌లోకి వెళ్లారని అధికారులు తెలిపారు.

గర్బిణికి కరోనా.. క్వారంటైన్‌లోకి ముగ్గురు డాక్టర్లతో సహా సిబ్బంది
Balaraju Goud
|

Updated on: Jul 12, 2020 | 4:35 PM

Share

కరోనా మహమ్మారి కాటుకు చిన్న పెద్ద తేడా లేకుండా బలవుతున్నారు. తెలియకుండానే వైరస్ అంటుకుంటోంది. తాజాగా భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకున్న ఓ గర్భిణికి కరోనా సోకడంతో.. ముగ్గురు వైద్యులతోపాటు 12 మందిని హోంక్వారంటైన్‌లోకి వెళ్లారని అధికారులు తెలిపారు.

కృష్ణా జిల్లా మండవల్లి మండలం గన్నవరం గ్రామానికి చెందిన గర్భిణికి పురుటినొప్పులు రావడంతో శుక్రవారం భీమవరంలోని ప్రభుత్వాసుపత్రిలో చేరింది. కొవిడ్ టెస్ట్ చేయకుండా మహిళకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీంతో పండంటి ఆడ శిశవు జన్మించింది మహిళ. అయితే, అదేరోజు సాయంత్రం భీమవరంలో నిర్వహించిన పరీక్షల నివేదికల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తల్లీబిడ్డలను ఏలూరు కొవిడ్‌ ఆసుపత్రికి వైద్యులు తరలించారు. ఆమెకు వైద్యం చేసిన వైద్యసిబ్బందిలో టెన్షన్ మొదలైంది. దీంతో ముగ్గురు వైద్యులతోపాటు 9 మంది సిబ్బందిని హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్‌ శివప్రసాద్‌ తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.