బ్రేకింగ్: అరవింద్‌ది దొంగ సర్టిఫికేట్?

బీజేపీకి చెందిన నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించారని, తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్ పార్టీ....

బ్రేకింగ్:  అరవింద్‌ది దొంగ సర్టిఫికేట్?
Follow us

|

Updated on: May 24, 2020 | 11:56 AM

TRS Leader Krishank alleging that Nizamabad MP D.Aravind produced fake PG certificate: బీజేపీకి చెందిన నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించారని, తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంత్ ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. అరవింద్ తప్పుడు సర్టిఫికేట్లతో ఎన్నికల అఫిడవిట్ సమర్పించారన్నది క్రిశాంత్ ప్రధాన అభియోగం.

నిజామాబాద్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ధర్మపురి అరవింద్ తాను రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. పొలిటికల్ సైన్సు విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినట్లు అఫిడవిట్ సమర్పించారని క్రిశాంక్ ఆరోపిస్తున్నారు. ‘‘ నిజానికి అరవింద్ ఎన్నికల కమిషన్‌ను తప్పుడు దోవ పట్టిచ్చారు.. ఎన్నికల అఫిడవిట్‌లో ఏంఏ పొలిటికల్ సైన్స్ చదివిన అని తప్పుడు సమాచారం ఇచ్చారు.. అరవింద్ దొంగ సర్టిఫికెట్ సృష్టించాడు.. అసలు అరవింద్ రాజస్థాన్ రాష్ట్రంలో ఎలాంటి విద్యను అభ్యసించలేదు… దొంగ సర్టిఫికెట్ రూపకల్పన వివాదంలో ఇరుక్కుని సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఒక సంస్థ నుంచి పీజీ సర్టిఫికెట్‌ను అరవింద్ కొన్నారు..’’ అని క్రిశాంక్ వాదిస్తున్నారు.

నిజామాబాద్ ఎంపీపై అనర్హత వేటు వెయ్యాలంటూ త్వరలో హైకోర్టులో కేసు వేస్తున్నామని ఆయన తెలిపారు. ఏడాదిగా అరవింద్ దొంగ సర్టిఫికెట్‌తో ఎంపీగా చలామణి అవుతున్నారని క్రిశాంక్ ఆరోపిస్తున్నారు. క్రిశాంక్ వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ కలకలం చెలరేగింది. అయితే, మాజీ ఎంపి కవిత మెప్పు పొందేందుకే క్రిశాంత్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కమలనాథులు మండిపడుతున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!