అన్నంత పని చేసిన హర్షకుమార్.. సుప్రీం ముందుకు బోటు యాక్సిడెంట్

| Edited By: Anil kumar poka

Oct 05, 2019 | 8:32 PM

గోదావరిలో మునిగిన బోటు వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. కచ్చులూరు పడవ ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్‌. ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఆచూకీ లభించని మృతదేహాలను వెలికితీసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. విచారణలో కేంద్రం జోక్యం చేసుకునేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ పలు సందేహాలను లేవనెత్తిన విషయం తెలిసిందే. బోటు ప్రమాదంలో గతంలో సంచలన […]

అన్నంత పని చేసిన హర్షకుమార్.. సుప్రీం ముందుకు బోటు యాక్సిడెంట్
Follow us on

గోదావరిలో మునిగిన బోటు వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. కచ్చులూరు పడవ ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్‌. ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఆచూకీ లభించని మృతదేహాలను వెలికితీసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. విచారణలో కేంద్రం జోక్యం చేసుకునేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ పలు సందేహాలను లేవనెత్తిన విషయం తెలిసిందే. బోటు ప్రమాదంలో గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. ప్రభుత్వ వివరణతో విభేదిస్తూ.. బోటులో 93 మంది ప్రయాణించారని ఆరోపించారు. వరదను అంచనా వేస్తూ.. గోదావరిలోకి బోటు వెళ్లవద్దని దేవీపట్నం ఎస్ఐ వారించినా ఓ ఓ మంత్రి ఫోన్ చేయడం వల్లే బోటు ముందుకు కదిలిందన్నారు. బోట్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన.. ప్రమాదం జరిగిన బోటులో కూడా అలానే జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

గోదావరిలో తిరిగే బోట్లలో నాయకులు, పర్యాటక శాఖ అధికారుల పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఈ ప్రమాదంపై అధికారులు సీఎం జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని హర్ష కుమార్ ఆరోపించారు. దీంతో బోటులో అసలు ఎంత మంది ప్రయాణించారనే దానిపై వివాదం రాజుకుంది. అయితే బోటులో 93 మంది ఉన్నారని ఎలాంటి ఆధారాలతో చెప్తున్నారని హర్ష కుమార్‌ కు పోలీసులు నోటీసులు పంపించారు. దీనిపై సమాధానమివ్వని హర్ష కుమార్‌ తాజాగా సుప్రీం తలుపు తట్టారు.