పబ్‌జీ కాదు… అక్షయ్‌ కుమార్ ‘ఫౌజీ’‌ వచ్చేస్తోంది

పబ్‌జీ గేమ్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్ ఓ ప్రకటన చేశారు. త్వరలో మల్టీ ప్లేయర్‌ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు  పేర్కొన్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ఉద్యమంలో భాగంగా దీన్ని...

పబ్‌జీ కాదు... అక్షయ్‌ కుమార్ ‘ఫౌజీ’‌ వచ్చేస్తోంది
Follow us

|

Updated on: Sep 04, 2020 | 7:06 PM

ఇండియా నుంచి చైనా గేమ్ పబ్ జీ అవుట్ అవడంతో… ఇప్పుడు ఫౌజీ రాబోతోంది. పబ్‌జీ గేమ్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్ ఓ ప్రకటన చేశారు. త్వరలో మల్టీ ప్లేయర్‌ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు  పేర్కొన్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ఉద్యమంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన ప్రకటించారు. ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌ గార్డ్స్‌ … ‘ఫౌజీ’ పేరుతో మల్టీ ప్లేయర్‌ గేమ్‌ను త్వరలో ఈ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ప్రధాని పిలుపునిచ్చిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ఉద్యమంలో భాగంగా ‘ఫౌజీ’‌ను తీసుకొస్తున్నాం. కేవలం వినోదమే కాదు.. మన సైనికుల త్యాగాలను తెలియజేయబోతున్నాం అంటూ పేర్కొన్నారు. ఈ గేమ్‌ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం ‘భారత్‌కా వీర్‌ ట్రస్ట్‌’కు అందజేయనున్నామని అక్షయ్‌ సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొచ్చారు. గేమ్‌కు సంబంధించిన పోస్టర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీన్ని బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్‌ గేమ్స్‌ రూపొందించింది. అక్షయ్‌ దీనికి మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల టెన్సెంట్‌ గేమ్స్‌కు చెందిన పబ్జీ సహా 118 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో పబ్జీ ప్లేయర్లు నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో అక్షయ్‌ ‘ఫౌజీ‌’ పేరుతో ముందుకు రావడం గమనార్హం. అక్షయ్‌ పోస్టు చేసిన వెంటనే పలువురు సంతోషం వ్యక్తంచేశారు. గేమ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పోస్ట్‌ చేస్తున్నారు. అక్షయ్‌ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘బెల్‌ బోటమ్‌’ చిత్రీకరణ నిమిత్తం యూకేలో ఉన్నారు.