AP Local Body Elections: ఆ రెండు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలు మార్చిన ఎస్​ఈసీ.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

ఏపీ ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల వినతి మేరకు పశ్చిమగోదావరి,ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలను మారుస్తున్నట్లు ప్రకటించింది.

AP Local Body Elections: ఆ రెండు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలు మార్చిన ఎస్​ఈసీ.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Follow us

|

Updated on: Jan 28, 2021 | 9:34 PM

AP Local Body Elections:  ఏపీ ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల వినతి మేరకు పశ్చిమగోదావరి,ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలను మారుస్తున్నట్లు ప్రకటించింది. ఒంగోలులో ఉన్న 20కి గాను 15 మండలాలకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒంగోలు డివిజన్​లో మిగిలిన 5 మండలాలైన కొరిశపాడు, జె.పంగులూరు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవలో ఫిబ్రవరి 13న రెండో దశలో ఎన్నికలు జరపనుంది ఎస్‌ఈసీ.

ఇక పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో 3వ దశకు బదులు ఫిబ్రవరి 13న రెండోదశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏలూరు పరిధిలోని 4 మండలాలకు ఎన్నికల తేదీల్లో మార్పులు జరిగాయి.  లింగపాలెం , జె.నర్సాపురం, చింతలపూడి, కామవరపుకోట, మండలాల్లో 4వ దశకు బదులు ఫిబ్రవరి 17న 3వ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.

Also Read:

Andhra Pradesh Govt: ఎస్ఈసీ ప్రొసీడింగ్స్‌ను తిప్పి పంపండి.. కేంద్రానికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా