YS Jagan: వైసీపీ అధినేత జగన్‌ కీలక నిర్ణయం.. మళ్లీ పాదయాత్రకు సిద్ధం!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేజ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరోసారి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రతి వారం ఒక్కొ నియోజవర్గం చొప్పున పాదయాత్ర చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్రను మొదలు పెట్టనున్నట్టు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

YS Jagan: వైసీపీ అధినేత జగన్‌ కీలక నిర్ణయం.. మళ్లీ పాదయాత్రకు సిద్ధం!
Ysrcp Chief Ys Jagan Decides To Undertake A Pada Yatra

Updated on: Jan 21, 2026 | 6:34 PM

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు మాజీ సీఎం జగన్. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతానని ప్రకటించారు. ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానన్నారు. ఇక ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానన్నారు. చంద్రబాబు పాలనంతా అబద్దాలు మోసాలే అని.. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.