
పిల్లి ఎదురువస్తే అపశకునం అనుకుంటారు. కానీ చాలామంది పిల్లిని పెంచుకుని దానికోసం తమ ఆస్తులు సైతం రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక మనకు రొటీన్ గా ఇళ్ల మధ్య తిరుగుతూ కనిపించే పిల్లికి అడవుల్లో కనిపించే పిల్లికి చాలా తేడా ఉంటుంది. అదే వాడుక భాషలో మన్నప్రాంతంలో బావురు పిల్లి అంటారు. ఈ బావురుపిల్లి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జంతువు “ఫిషింగ్ క్యాట్” గా పిలుస్తారు.
చిత్తడి నేలలు, చెరువులు, నదీ తీరాలు, ముఖ్యంగా మడ అడవులు ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా బావురు పిల్లి సంచారం ఉంటుంది. బావురు పిల్లి ప్రత్యేకత ఏంటంటే ఇది నీటిలో ఈదుతూ చేపలను వేటాడుతుంది. ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల్లో ఈ బావురు పిల్లి కూడా ఉంది. చేపలు పెట్టె గుడ్లను మరికొన్ని రకాల చేపలు తినేస్తుంటాయి. అయితే అలాంటి చేపలను ఈ బావురు పిల్లులు తినటం వల్ల జీవ వైవిద్యంకు ఈ పిల్లులు దోహద పడుతుంటాయి. అందుకే వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోరింగ ఫారెస్ట్ లో ఈ బావురు పిల్లి ని గుర్తించారు.
ఏజెన్సీ ప్రాంతమైన ఏలూరు జిల్లాలోని కుక్కునూరు ప్రాంతంలో స్థానికులకు ఈ బావురు పిల్లి భయం పట్టుకుంది. ఇది రాత్రి పూట తిరుగుతూ.. అదును చూసి పెంపుడు కోళ్లను ఎత్తుకు వెళ్లి తింటున్నాయి. దీంతో ఊరిలో ఉన్న స్థానికులు కోళ్లు ఏమైపోతున్నాయనే ఆందోళన మొదలైంది. ఇలా కుక్కుననూరు మండలం మర్రిపాడు గ్రామంలో రోజు ఈ పరిస్థితి నెలకొనడంతో గ్రామస్తులందరూ కలిసి ఒక వల ఏర్పాటు చేశారు. అందులో అడవి పిల్లి పడింది. అయితే దాని ప్రాధాన్యత తెలియక దాన్ని కొట్టి చంపేశారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..