Vizianagaram: భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు వేసి పడుకోబెట్టింది.. ఆ తర్వాత ప్రియుడ్ని పిలిచింది.. కట్ చేస్తే

|

Jul 07, 2023 | 3:32 PM

మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. భర్త ఉంటే ఆ వ్యవహారం సరిగ్గా కుదరడం లేదు. అందుకే అతడ్ని లేపేయాలని డిసైడయ్యింది. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసింది.. కానీ...

Vizianagaram: భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు వేసి పడుకోబెట్టింది.. ఆ తర్వాత ప్రియుడ్ని పిలిచింది.. కట్ చేస్తే
Mutton Biryani
Follow us on

మాయదారి వివాహేతర సంబంధాల మాయలో పడి క్రైమ్ చేసేందుకు కూడా వెనకాడటం లేదు కొందరు. పిల్లల భవిష్యత్‌ను కూడా పట్టించుకోవడం లేదు. వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసిన.. భాగస్వాములను పరాయివాళ్ల మోజులో చంపేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా విజయనగరంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కుమ్మరివీధిలో నివాసం ఉండే కోటరాజుకు భార్య శ్రీదేవి, పిల్లలు ఉన్నారు. వీరంతా బుధవారం రాత్రి వేళ రోజూలానే  నిద్ర పోయేందుకు రెడీ అయ్యారు. పడుకునే ముందు భర్తకు భార్య ప్రేమగా మటన్ బిర్యానీ పెట్టింది. ట్విస్ట్ ఏంటంటే అందులో నిద్రమాత్తలు కలిపింది. భర్త నిద్రలోకి జారుకున్నాక ఎన్నాళ్ల నుంచో వివాహేతర సంబంధం నెరపతున్న ప్రియుడు చిన గోకవీధికి చెందిన గంధవరపు రఘును ఇంటికి పిలిచింది.

అతడితో కలిసి భర్తను ఖతం చేయాలని పక్కాగా స్కెచ్ వేసింది. నిద్రమాత్రలు కూడా ప్రియుడి ద్వారా అంతకుముందే తెప్పించింది. ఇంకేముంది కోటరాజు మెడకు నైలాన్‌తాడు బిగించి చంపేందుకు ఇద్దరూ యత్నించారు. అతడికి మెలుకువ రావడంతో బిగ్గరగా కేకలు వేశాడు. దీంతో ఇద్దరూ పారిపోయారు. వెంటనే  టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కోటరాజు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. వారికి బొగ్గులదిబ్బకు చెందిన కేత శ్రీను అనే వ్యక్తి కూడా సాయం చేసినట్లు గుర్తించి అతడిని కూడా రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..