108 అంబులెన్స్‌లో నిండు గర్భిణీ ప్రసవం

|

Oct 29, 2020 | 7:27 PM

పురిటి నొప్పులతో ఉన్న గర్భిణీని ఆస్పత్రికి తరలిస్తుండగా 108 వాహనంలోనే ప్రసవించింది. 108 సిబ్బంది ఆమెకు డెలివరీ చేసి తల్లీ, బిడ్డలను కాపాడారు.

108 అంబులెన్స్‌లో నిండు గర్భిణీ ప్రసవం
Follow us on

పురిటి నొప్పులతో ఉన్న గర్భిణీని ఆస్పత్రికి తరలిస్తుండగా 108 వాహనంలోనే ప్రసవించింది. 108 సిబ్బంది ఆమెకు డెలివరీ చేసి తల్లీ, బిడ్డలను కాపాడారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం గ్రామానికి చెందిన యలమంచిలి ధనలక్ష్మి 28 సంవత్సరాలు. మూడవ కాన్పు నేపథ్యంలో పురిటి నొప్పులతో బాధపడుతూ 108 సమాచారం అందించగా 108 సిబ్బంది హుటాహుటిన ఆమెను ఈదుపురం చేరుకున్నారు. గర్భిణికి ప్రాధమిక పరీక్షలు చేసి అంబులన్స్ లో తరలిస్తుండగా మార్గ మధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది ఆమెకు పురుడు పోయగా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలను ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు.