Breaking: ఆలయ రథానికి నిప్పు.. నెల్లూరులో ఉద్రిక్తత!

నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఆలయ రథానికి నిప్పు పెట్టారు దుండగులు. ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథాన్ని నిప్పుపెట్టిన వారు ఆ తరువాత అక్కడి నుంచి పరారీ అయ్యారు. రెండు వర్గాల మధ్య వివాదమే ఈ ఘటనకు కారణమంటున్నారు స్థానికులు. మరోవైపు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పకీర్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కొండబిట్రగుంటలో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఈ ఘటనపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు […]

Breaking: ఆలయ రథానికి నిప్పు.. నెల్లూరులో ఉద్రిక్తత!

Updated on: Feb 14, 2020 | 5:00 PM

నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఆలయ రథానికి నిప్పు పెట్టారు దుండగులు. ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథాన్ని నిప్పుపెట్టిన వారు ఆ తరువాత అక్కడి నుంచి పరారీ అయ్యారు. రెండు వర్గాల మధ్య వివాదమే ఈ ఘటనకు కారణమంటున్నారు స్థానికులు. మరోవైపు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పకీర్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కొండబిట్రగుంటలో ఉద్రిక్తత నెలకొంది.

మరోవైపు ఈ ఘటనపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. దీనిపై ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి తక్షణమే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆకతాయిల చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ఆయన అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us