AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో మార్పులు‌.. రూ.3,500 కోట్లు ఆదా

టీడీపీ హయాంలో అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో మార్పులు‌.. రూ.3,500 కోట్లు ఆదా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 28, 2020 | 7:39 AM

Share

Anantapur to Amaravati Express Way: టీడీపీ హయాంలో అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎక్స్‌ప్రెస్‌ వేను కోల్‌కతా-చెన్నై(ఎన్‌హెచ్‌ 16) రహదారికి సమాంతరంగా నిర్మించాలని అప్పటి ప్రభుత్వం భావించింది. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో జగన్ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేను ఎన్‌హెచ్ ‌16కు సమాంతరంగా నిర్మించడానికి బదులు ఎన్‌హెచ్‌ 16తో అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అంతేకాదు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంకు ప్రతిపాదనలు పంపగా.. అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో మరో 47 కిలోమీటర్ల దూరం(గతంలో 101కి.మీలు) తగ్గనుండటంతో పాటు 741 హెక్టార్ల భూమిని సేకరించే ప్రతిపాదనలను వెనక్కి తీసుకోనున్నారు. దీంతో రూ.3,500 కోట్ల ఖర్చు తగ్గింది. కాగా ఈ ఎక్స్‌ప్రెస్‌ వేలో భాగంగా రూ.867 కోట్లతో చిలకలూరి పేట బైపాస్‌ నిర్మాణం ప్రారంభమైంది.

ఎక్స్‌ప్రెస్‌ వే వివరాలు:

అనంతపురం మొదలు వైఎస్సార్‌ కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం చేపట్టనున్నారు. ఇక ఈ ఎక్స్‌ప్రెస్‌ వే రూ.27,635 కోట్లు  ఖర్చు అవుతాయని అప్పటి ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ.. తాజా మార్పులతో రూ.3,500కోట్లు ఆదాయం అవ్వనున్నాయి. ఇక ఈ ఎక్స్‌ప్రెస్‌వే వలన 148 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గడంతో పాటు 2 గంటల ప్రయాణ సమయం ఆదా అవ్వనుంది.

Read This Story Also: కేజీహెచ్ వద్ద డాక్టర్ నమ్రత హై డ్రామా

Follow Us
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను