తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోనే నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని..

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Updated on: Apr 27, 2020 | 8:43 AM

తెలుగు రాష్ట్రాల్లోనే నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 48 గంటల్లో అది మరింత బలపడి, తీవ్రంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ అల్పపీడనం ఈ నెల 30 నుంచి మే 3 వరకూ ఉండనుందని అండమాన్ నికోబార్ దీవుల వైపు ప్రయాణించే అవకాశం ఉందని వివరించింది. ఎండ తీవ్రత, బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొందని అన్నారు. ఈ ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Read More: 

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

అన్నీ తెలిసే వెళ్లాడు.. తనకి నేనేం సలహాలు ఇస్తాను? పవన్‌పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

Loading...
Unable to load recommendations.
Follow Us