Visakha Kidnap: విశాఖ కేజీహెచ్లో పసికందు మాయం.. కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా..?

|

Mar 17, 2022 | 1:22 PM

విశాఖ కేజీహెచ్లో(Visakhapatnam KGH) పసికందు అదృశ్యం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని మహిళలు.. నాలుగు రోజుల ఆడ శిశువును అపహరించినట్లు పోలీసులు గుర్తించారు.

Visakha Kidnap: విశాఖ కేజీహెచ్లో పసికందు మాయం.. కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా..?
Kidnap
Follow us on

విశాఖ కేజీహెచ్లో(Visakhapatnam KGH) పసికందు అదృశ్యం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని మహిళలు.. నాలుగు రోజుల ఆడ శిశువును అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాలో శిశువును ఓ మహిళ ఎట్టుకేక్తున్నట్టు రికార్డయింది. ఆసుపత్రి సిబ్బందితో పాటు శిశువు తల్లి, బందువులను పోలీసులు విచారిస్తున్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం, రేవిడి రౌతులపాలెం గ్రామానికి చెందిన మజ్జి అప్పయ్యమ్మ కేజీహెచ్ లోని గైనిక్ వార్డులో ఈనెల 11న చేరింది. ఈనెల 13న పాపకు జన్మనిచ్చింది. సిజేరియన్ కావడంతో తల్లికి వైద్య సేవలందిస్తున్నారు. అయితే.. మొన్న సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో గుర్తు తెలియని మహిళలిద్దరూ ఆ వార్డులోకి వెళ్లి పసికందును తీసుకుని అక్కడి నుండి పరార్‌ అయ్యారు. ఆ సమయంలో పసికందు అమ్మమ్మ అక్కడే ఉన్నారు.

కెజిహెచ్ సిబ్బంది. అనుకొని పసికందును ఆ మహిళలిద్దరికీ ఇచ్చినట్టు చెబుతొంది ఆ మహిళ. సమయం దాటుతున్న ఆ మహిళలు, పాపను తీసుకుని రాకపోవడంతో పసికందు తల్లి కంగారు పడింది. దీంతో వార్డులోని సిబ్బంది అక్కడికి చేరుకుని తల్లితో మాట్లాడారు. పసికందు అపహరణకు గురైనట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడకు చేరుకుని గైనిక్ గేటు ఎదురుగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. గుర్తు తెలియని మహిళ, పసికందును తీసుకొని వేగంగా నడుచుకుంటూ వార్డు లోపలినుండి బయటకు పారిపోయినట్టు రికార్దాయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడి ఆటో స్టాండ్ లో విచారించగా ఇద్దరు మహిళలు పసికందును తీసుకొని ఆటోలో గురుద్వారా చేరుకొని విజయ డయాగ్నస్టిక్ బస్టాప్ వద్ద దిగినట్టు తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్..

Nail Biting Habit: మీకు కూడా గోళ్లు కొరికే అలవాటు ఉందా? ఈ అలవాటును ఎలా వదిలించుకోవాలో తెలుసా..