వరుడు ఐసోలేషన్‌లో.. వధువు క్వారంటైన్‌లో.. గ్రామం కంటైన్మెంట్ జోన్‌లో..!

కరోనా కాలంలో పెళ్లి చేసుకున్న నవ వధూవరుల కుటుంబాలతో పాటు గ్రామాల్లోనూ కోవిడ్ మహమ్మారి కలకలం రేపింది. పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతడిని ఐసోలేషన్‌కి తరలించారు. అలాగే వధువు సహా పెళ్లికి హాజరైన మరికొంతమందిని క్వారంటైన్‌కి పంపారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఈ నెల 10న అతడి వివాహం కావడంతో ఏపీకి వచ్చాడు. […]

వరుడు ఐసోలేషన్‌లో.. వధువు క్వారంటైన్‌లో.. గ్రామం కంటైన్మెంట్ జోన్‌లో..!

Updated on: Jun 13, 2020 | 10:17 AM

కరోనా కాలంలో పెళ్లి చేసుకున్న నవ వధూవరుల కుటుంబాలతో పాటు గ్రామాల్లోనూ కోవిడ్ మహమ్మారి కలకలం రేపింది. పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతడిని ఐసోలేషన్‌కి తరలించారు. అలాగే వధువు సహా పెళ్లికి హాజరైన మరికొంతమందిని క్వారంటైన్‌కి పంపారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

కర్నూల్ జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఈ నెల 10న అతడి వివాహం కావడంతో ఏపీకి వచ్చాడు. కరోనా పరీక్షలకు నమూనాలు కూడా ఇచ్చాడు. అయితే ఆ ఫలితాలు రాకముందే వెల్దుర్తి మండలం ఎల్‌.తండాకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి జరిగిన రిసెప్షన్‌లో అతడు అస్వస్థతకు గురయ్యాడు. అదే సమయంలో ఆయన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని ఐసోలేషన్ సెంటర్‌కి, పెళ్లికూతురిని క్వారంటైన్‌కి తరలించారు. ఇక పెళ్లి వేడుకల్లో బంధుమిత్రులు సహపంక్తి భోజనాలు చేసినట్లు తేలడంతో అధికారులు గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా గుర్తించారు. 70 కుటుంబాల నుంచి నమూనాలను సేకరించారు.

Read This Story Also: నేను షూటింగ్‌లకి రాను.. నా కూతురిని కూడా పంపను: శక్తి కపూర్

Loading...
Unable to load recommendations.
Follow Us