Telangana Corona Cases: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,445 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,38,632 కు చేరింది. 24 గంటల్లో ఆరుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,336కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,486 మంది డిశ్చార్జ్ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,18,887 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 18,409 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 41,243 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్ల సంఖ్య 42,81,991 కు చేరింది. ( నేటితో ముగియనున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు)
జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 286, ఆదిలాబాద్ 19, భద్రాద్రి కొత్తగూడెం 90, జగిత్యాల్ 35, జనగాం 25, జయశంకర్ భూపాలపల్లి 21, జోగులమ్మ గద్వాల్ 10, కామారెడ్డి 22, కరీంనగర్ 65, ఖమ్మం 77, కొమరం భీమ్ అసిఫాబాద్ 7, మహబూబ్ నగర్ 28, మహబూబాబాద్ 19, మంచిర్యాల్ 18, మెదక్ 22, మేడ్చల్ మల్కాజ్గిరి 122, ములుగు 22, నాగర్ కర్నూల్ 23, నల్గొండ 102, నారాయణ్పేట్ 4, నిర్మల్ 22, నిజామాబాద్ 18, పెద్దంపల్లి 25, రాజన్న సిరిసిల్ల 26, రంగారెడ్డి 107, సంగారెడ్డి 27, సిద్ధిపేట్ 43, సూర్యాపేట 29, వికారాబాద్ 22, వనపర్తి 21, వరంగల్ రూరల్ 17, వరంగల్ అర్బన్ 53, యాద్రాది భువనగిరి 18 కేసులు నమోదయ్యాయి. ( ఆస్ట్రేలియా పర్యటన: భారత క్రికెటర్లకు బీసీసీఐ గుడ్న్యూస్)