అనంతపురంలో టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ

| Edited By:

Feb 18, 2019 | 9:55 AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. దీంతో కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘర్షణతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. అయితే మరోసారి దాడులు జరగకుండా పోలీసులు భారీ […]

అనంతపురంలో టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ
Follow us on

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. దీంతో కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘర్షణతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. అయితే మరోసారి దాడులు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.