ఏఎన్నార్, హరికృష్ణ, దాసరి విగ్రహాల తొలగింపు

| Edited By:

May 14, 2019 | 4:47 PM

విశాఖపట్టణంలో అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. అనుమతులు లేకుండా ఉన్నాయంటూ బీచ్‌రోడ్డులోని మూడు విగ్రహాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. వాటిలో దాసరి నారాయణ రావు, అక్కినేని నాగేశ్వరరావు, హరికృష్ణ విగ్రహాలు ఉన్నాయి. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవల పలు ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ విగ్రహాలను తొలగించాలంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతో జీవీఎంసీ అధికారులు విగ్రహాలను తొలగించారు.

ఏఎన్నార్, హరికృష్ణ, దాసరి విగ్రహాల తొలగింపు
Follow us on

విశాఖపట్టణంలో అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. అనుమతులు లేకుండా ఉన్నాయంటూ బీచ్‌రోడ్డులోని మూడు విగ్రహాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. వాటిలో దాసరి నారాయణ రావు, అక్కినేని నాగేశ్వరరావు, హరికృష్ణ విగ్రహాలు ఉన్నాయి. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవల పలు ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ విగ్రహాలను తొలగించాలంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతో జీవీఎంసీ అధికారులు విగ్రహాలను తొలగించారు.