వివాహ వేడుకలో విషాదం.. 500మందికి అస్వస్థత

| Edited By:

Feb 19, 2019 | 6:19 AM

భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన వివాహవేడుకలో ఏర్పాటుచేసిన విందు వికటించి సుమారు 500మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విందులో వడ్డించిన పాయసం తినడం వల్లే వారంతా అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.

వివాహ వేడుకలో విషాదం.. 500మందికి అస్వస్థత
Follow us on

భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన వివాహవేడుకలో ఏర్పాటుచేసిన విందు వికటించి సుమారు 500మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విందులో వడ్డించిన పాయసం తినడం వల్లే వారంతా అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.