తిరుపతి, జులై 12: తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తురాలు తీవ్రంగా గాయపడింది. తిరుమల కొండపై ఉన్న జపాలి తీర్థంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళ్లున్న ఓ యువతిపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని హుటాహుటీన ఆసుపత్రికి తీసుకెళ్లగా.. తల, వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. వివరాల్లోకెళ్తే..
తిరుమల జపాలి తీర్థంలో చెట్టు కొమ్ము విరిగి భక్తుల మీద పడింది. ఈ ప్రమాదంలో ఓ భక్తురాలు తీవ్రంగా గాయపడింది. జపాలీతీర్థం గుడి ముందు వెళుతున్న భక్తులపై చెట్టు కొమ్ము వర్షానికి తడిచి పడి పోయింది. అదే సమయంలో జపాలిలోని ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ముందుకు కదులుతున్న మహిళ వీపు భాగంపై చెట్టు కొమ్మ పడింది. దీంతో ఒక్కసారిగా అక్కడికక్కడే ఆమె నేలపై కుప్పకూలింది. చెట్టు కొమ్ము విరిగి పడటంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని బెంగళూరుకు చెందిన 55 ఏళ్ల ఉమాదేవిగా గుర్తించారు.
వెన్నెముక విరిగి పోవడంతో ఆమె లేవలేక పోయింది. స్థానికంగా ఉన్న భక్తుల సాయంతో ఉమాదేవిని ఆసుపత్రికి తరలించారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉమారాణి రెండ్రోజుల క్రితం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చింది. జపాలి నడక మార్గం, ఆలయం వద్ద ఎండిపోయిన చెట్లు ఇలా కులేందుకు సిద్ధంగా ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు భక్తులు వాపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.