Tirupati By-Election: తిరుపతి ఉప ఎన్నిక.. అధికార, ప్రతిపక్షంలోని ఆ నాయకులకు అగ్ని పరీక్ష..

|

Mar 24, 2021 | 6:06 PM

Tirupati Lok Sabha by-poll: తిరుపతి లోక్‌సభ సీటు ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంతో వెడెక్కిస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న

Tirupati By-Election: తిరుపతి ఉప ఎన్నిక.. అధికార, ప్రతిపక్షంలోని ఆ నాయకులకు అగ్ని పరీక్ష..
Follow us on

Tirupati Lok Sabha by-poll: తిరుపతి లోక్‌సభ సీటు ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంతో వెడెక్కిస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం సైతం మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ ఇంకా ఎవరిపేరును ప్రకటించలేదు. అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని బరిలోకి దింపగా.. టీడీపీ పనబాక లక్ష్మికి టిక్‌ట్‌ను కేటాయించింది. ఈ క్రమంలో ఆమె బుధవారం నామినేషన్ ను సైతం దాఖలు చేశారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జులను నియమించాయి. వైసీపీ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జులను నియమించగా.. టీడీపీ 10 క్లస్టర్లతోపాటు.. నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించింది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైసీపీ బాధ్యులు..

తిరుపతి – మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే చెవిరెడ్డి
శ్రీకాళహస్తి – మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి
సత్యవేడు – మంత్రి కొడాలి నాని, చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి
గూడూరు – మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
సూళ్లూరుపేట – మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
సర్వేపల్లి – మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి
వెంకటగిరి – మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి

టీడీపీ బాధ్యుల వివరాలు..

తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా మాజీ మంత్రి సోమిరెడ్డి
తిరుపతి ఇన్‌ఛార్జ్‌గా నిమ్మల రామానాయుడు
10 కస్టర్లల్లో ఇన్‌ఛార్జ్‌లు…
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చెంగల్రాయుడు, గద్దె రామ్మోహన్ రావు, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, దామచర్ల జనార్దన్, దువ్వారపు రామారావు, బండారు మాధవ నాయుడు, గౌతు శిరీష, గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీ సత్యనారాయణ రాజు,

శ్రీకాళహస్తి-ఇన్‌ఛార్జిగా బొజ్జల సుధీర్‌రెడ్డి
సత్యవేడు- జేడీ రాజశేఖర్, ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు
ఎన్నికల పరిశీలకులు.. ఆదిరెడ్డి వాసు, గాలి భాను ప్రకాష్
10 క్లస్టర్లల్లో ఇన్‌ఛార్జ్‌లు..
బుద్దా వెంకన్న, బోడె ప్రసాద్, శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీ తిప్పేస్వామి, పుట్టా సుధాకర్ యాదవ్, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జగదీశ్వరరావు, కేఈ ప్రభాకర్, బి. అశోక్, వెంకట రామకృష్ణ ప్రసాద్
గూడూరు- మాజీ మంత్రి జవహర్, అమరనాధ్ రెడ్డి
సర్వేపల్లి- ప్రత్తిపాటి పుల్లారావు
వెంకటగిరి- దేవినేని ఉమ
సూళ్లూరుపేట-పరసా రత్నం

Also Read:

YS Sharmila: వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్న నియోజకవర్గం ఇదే.. ఆమే క్లారిటీ ఇచ్చేసింది

Tirupati By-Election: రసవత్తరంగా తిరుపతి ఉప ఎన్నిక.. ఉద్ధండులను దింపిన వైసీపీ, టీడీపీ.. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ?