అప్పుడే భానుడి భగభగ.. ఈ వేసవి మరింత అగ్నిగుండం!

| Edited By:

Feb 19, 2020 | 1:00 PM

ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలేదు.. ఇప్పటికే భానుడు భగభగా మండుతున్నాడు. రథసప్తమి ఇలా వెళ్లిందో లేదో.. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత..

అప్పుడే భానుడి భగభగ.. ఈ వేసవి మరింత అగ్నిగుండం!
Follow us on

ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలేదు.. ఇప్పటికే భానుడు భగభగా మండుతున్నాడు. రథసప్తమి ఇలా వెళ్లిందో లేదో.. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో.. ప్రజలు ఇప్పటి నుంచే పలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

కాగా.. గతేడాది అత్యధికంగా తెలంగాణలోని రామగుండం ప్రాంతంలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా ఈ ఏడాది అంతకు మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ఎండలకు తోడు వడగాలుల తీవ్రత పెరిగే అవకాశముందని వారు చెప్పారు. కాగా ఇప్పటి వరకూ భద్రాచలంలో 1973లో 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఆల్ టైమ్ రికార్డు కాగా.. ఈ సారి దాదాపు అంతే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే శివరాత్రి తర్వాత ఈ ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు.