
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. చలి తీవ్రత తగ్గి.. పగటి ఉష్ణోగ్రతలు పెగుతున్నాయి.. తెల్లవారుజాము వేళల్లో మాత్రమే చలి ఉంటుంది.. ఆ తర్వాత ఎండ వేడి పెరుగుతోంది. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై.. వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య – తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని.. సాధ్యమైనంత మేరకు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గమనిక :- రాగల 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ – యానములో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు .
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా ఆగ్నేయ దిశ నుండి వీస్తున్నాయి.. వీటి ప్రభావంతో రాగల 3 రోజులు.. గురువారం, శుక్రవారం, శనివారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..